బాలకృష్ణ అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి రోజా

-

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన విరసింహారెడ్డి చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో గత ఆదివారం రోజున మూవీ మేకర్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

” ఈయన ఉన్నాడంటే ఎప్పుడూ కూర్చుని శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు ఈ అక్కినేని.. తొక్కినేని” అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు, అక్కినేని వారసులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. తాజాగా ఇదే విషయంపై మంత్రి రోజా స్పందించారు. బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలకు నాగార్జున గారు సమాధానం చెప్పాలని అన్నారు.

అక్కినేని నాగేశ్వరరావుని, నందమూరి తారక రామారావుని దేవుళ్లుగా ప్రజలందరూ భావించారని.. వారు ఇప్పుడు రాజకీయాలలో లేనప్పుడు అలాంటి వారిని ఇలా మాట్లాడడం సమంజసం కాదన్నారు. అక్కినేని పై బాలయ్య చేసిన వ్యాఖ్యలు తప్పు అని అన్నారు. అవే వ్యాఖ్యలు ఎన్టీఆర్ పై చేస్తే ఆ ఫ్యామిలీ ఎలా బాధపడుతుందో చూడాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version