తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు దుర్మరణం

-

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం కల్రొడ్డుపల్లి వద్ద కల్వర్టును కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం.. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిని, క్షతగాత్రులను మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. తిరుమల దర్శనం తర్వాత కారులో కాణిపాకం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version