వివాదంలో మంత్రి రోజా భర్త సెల్వమణి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

-

మంత్రి రోజా భర్త సెల్వమణి పై టీడీపీ మండిపడింది. సెల్వమణి వ్యాఖ్యలపై రోజా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది టిడిపి. ఏపీలో సినిమా షూటింగులు జరపొద్దని చెప్పడానికి సెల్వమణి ఎవరు ? మంత్రి రోజా భర్త సెల్వమణి వ్యాఖ్యలు దేనికి సంకేతం? అని ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు ప్రశ్నించారు. సెల్వమణి వ్యాఖ్యలు రాష్ట్రాన్ని కించపరిచేలా, రాష్ట్రానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయి… ఓవైపు రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి రోజా అంటుంటే ఆమె భర్త మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలో సినిమా షూటింగులు జరగకుండా టూరిజం ఎలా అభివృద్ధి అవుతుంది..? రోజాకు మంత్రి పదవి వచ్చిన తర్వాత తన భర్తను లెక్క చేయడం లేదేమో అందుకే రోజాకు వ్యతిరేకంగా, రాష్ట్రానికి నష్టం చేకూర్చేలా సెల్వమణి వ్యవహరిస్తున్నారని అగ్రహించారు. తన ఇంట్లో పరిస్థితులు చక్కదిద్దుకోలేని రోజా ఇక రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఏం అభివృద్ధి చేస్తుంది..? రోజా పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పొరుగు రాష్ట్రాల్లో పర్యటీంచడం తప్ప రాష్ట్రంలో ఏదైనా పర్యాటక ప్రాంతాన్ని సందర్శించారా..? అని నిలదీశారు.

అసలు రాష్ట్రంలో ఎన్ని పర్యాటక కేంద్రాలు ఉన్నాయి..? వాటిలో ఏ ఏ వసతులు ఉన్నాయో రోజా ఒక్కరోజైనా సమీక్ష చేశారా? జగన్ రెడ్డి పాలనలో పర్యాటక రంగాన్ని పూర్తిగా వదిలేశారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు అలాంటి శాఖను మంత్రి రోజాకు కట్టబెట్టి రాష్ట్రంలో అసలు ఆ శాఖను లేకుండా చేసే కుట్ర పన్నుతున్నారు.రోజా తన మేకప్ మీద పెట్టిన శ్రద్ధ కనీసం ఒక్క శాతం అయినా పర్యాటక శాఖ పై పెట్టాలన్నారు. తన భర్త చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version