భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి తుమ్మల సీతారామ ప్రాజెక్ట్ ఎత్తిపోతల పనులను పరిశీలించారు. ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2 ను పరిశీలించిన మంత్రి తుమ్మల.. పంప్ హౌస్ టు నుంచి గోదావరి జలాలను దిగువకు విడుదల చేసారు. అయితే కృష్ణా జలాల పంపిణీ లో కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు గా ఉంది అన్నారు.
అలాగే దక్షిణాది రాష్ట్రాల పై కేంద్రం వివక్ష చూపిస్తుంది. జనాభా నియంత్రణ చేస్తే బహుమతిగా నిధులు తగ్గిస్తున్నారు. రాజీవ్ కెనాల్ ద్వారా సాగర్ ఆయకట్టు కు సాగునీరు ఇస్తాం. సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ లిఫ్ట్ లతో గోదావరి జలాలు తరలింపు చేస్తాం. వైరా రిజర్వాయర్ కు గోదావరి జలాలు తరలింపు తో సాగర్ ఆయకట్టు స్థిరీకరణ.. లక్షా 30 వేల ఎకరాల్లో సాగు నీటి ఎద్దడి లేకుండా నీటి తరలింపుతో పాటుగా సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సీఎం రేవంత్ పట్టుదలగా ఉన్నారు అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.