టీడీపీ సభ్యులకు సంస్కారం లేదు : మంత్రి రజిని

-

అసెంబ్లీలో టీడీపీ సభ్యులు రౌడీయిజం చేశారని మంత్రి విడదల రజిని ఆరోపించారు. చంద్రబాబు ప్రచార పిచ్చికి అమాయకులు బలయ్యారని, ఈ మారణకాండకు అడ్డుకట్ట వేసేందుకు జీవో నెం.1 తీసుకొచ్చామన్నారు. బీసీలు అంటే చంద్రబాబుకు మొదటి నుంచి చిన్న చూపు అని చెప్పారు.

అసెంబ్లీలో గొడవలు సృష్టించే ప్రచారం పొందాలని టిడిపి కుట్ర చేస్తుందని తెలిపారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు మార్షల్ పై కూడా దాడి చేశారని అన్నారు. ఇక అటు సభ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నందుకే TDP సభ్యుల్ని స్పీకర్ సస్పెండ్ చేశారని మంత్రి రోజా తెలిపారు. ‘ఇప్పుడు ఒక్కరోజే, గతంలో నన్ను ఒక సంవత్సరం సస్పెండ్ చేశారు’ అని గుర్తు చేశారు. స్పీకర్ దగ్గరకు ఎవరు రాకుండా కఠిన నిబంధనలు తీసుకురావాలన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కోసం కందుకూరులో 8 మంది, గుంటూరులో ఇద్దరు చనిపోయారన్నారు. ర్యాలీల్లో ఎవరు చనిపోవద్దని GO నెం. 1 ను సీఎం తీసుకువచ్చారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version