ప్రతిపక్షాలను మీరెలా పడగొట్టారో మేం డేటా పంపిస్తాం : ఈటల రాజేందర్

-

ఈ ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ప్రతిపక్షాలను పడగొట్టి.. చెడొగొట్టిందో తామూ దేశంలో ఉన్న అన్ని కోర్డులకు, మేధావులకు డేటా పంపిస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ నుంచి ఏ పేరుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ప్రశ్నించారు. 2018లో 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. కనీస మానవత్వం లేకుండా కాంగ్రెస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకున్నారని నిలదీశారు. ప్రతిపక్షం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు అభివృద్ధి జరగదని బెదిరింపులకు గురి చేస్తోంది నిజం కాదా అని అడిగారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఉన్న నలుగురు శాసనసభ్యులు ఏ విధంగా ఆణిముత్యాలు అవుతారని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఈటల పేర్కొన్నారు.

దేశం అధోగతి పాలవుతోందని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఈటల రాజేందర్‌ విమర్శించారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి వెల్లడించిన బాధనే.. తాము తెలంగాణలో అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. లక్షలాది మంది ఉద్యమంలో పాల్గొని, వేల మంది ప్రాణాలు అర్పిస్తే ఏర్పడిన రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురైందని ఆక్షేపించారు. కేసీఆర్ తానే ఒక రాజు, చక్రవర్తిలా రాజ్యాన్ని ఏలుతున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news