దానం, కడియం, తెల్లం మగాళ్లు అయితే రాజీనామా చేసి గెలవండి: MLA కౌశిక్ రెడ్డి

-

రేవంత్ రెడ్డి మీద టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద పాడి కౌశిక్ రెడ్డి మండిపడుతున్నారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలని తన సీఎం రేవంత్ రెడ్డి గుప్పెట్లో పెట్టుకున్నారని అన్నారు ప్రజాస్వామిక తెలంగాణ అని అధికారంలోకి వచ్చి దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. స్పీకర్ కార్యాలయాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభావితం చేస్తున్నారని అన్నారు.

BRS MLA Kaushik Reddy comments on revanth reddy

మేము పిటిషన్ ఇచ్చి నెల రోజులు అవుతున్న స్పీకర్ గారు ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. అందుకే నిన్న హై కోర్టును ఆశ్రయించాము. సోమవారం విచారణకు రానున్నది అని అన్నారు.హై కోర్టులో సోమవారం రోజు మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నాము. మా పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకీ వెళ్లిన కడియం, దానం, తెల్లం పై అనర్హత వేటు కచ్చితంగా పడుతుంది అన్నారు MLA కౌశిక్ రెడ్డి. అలానే దానం, కడియం, తెల్లం మొగుళ్ళు అయితే రాజినామా చేసి గెలవండి చూద్దాం అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news