దీదీ గెలిచింది.. మోదీ రాజీనామా చేస్తారా..? కవిత ఫైర్

-

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బండి సంజయ్ కేవలం మీడియాలో కనిపించడం కోసమే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉన్నవారు ఇష్టానుసారంగా కాకుండా హుందాగా వ్యవహరించాలని బండి సంజయ్ కి కవిత సూచించారు. ప్రతి ఎన్నికలలో బిజెపి నాయకులకు సవాల్ విసరడం అలవాటుగా మారిందని అన్నారు. పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలిచారని… మోడీ రాజీనామా చేశారా..? అని ప్రశ్నించారు.

పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికలను కూడా బిజెపి సవాల్ గా తీసుకుందని మరి ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మోడీ రాజీనామా చేశారా అని కవిత ప్రశ్నించారు. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిస్తే సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి అని సవాల్ విసిరారు. మరోవైపు ఈటెల కూడా తాను గెలిస్తే కేసీఆర్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news