32 జిల్లాలలో BJP నేతలపై MLC కవిత పరువు నష్టం దావా.. నేడే కోర్టు తీర్పు

-

32 జిల్లాలలో BJP నేతలపై MLC కవిత పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో కవిత, పిటిషన్ వేయగా.. నేడు విచారణ చేయనుంది న్యాయస్థానం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ MLC కవిత పరువు నష్టం దావా వేశారు. ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ పర్వేశ వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందర్ సిర్సా లపై TRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరువు నష్టం దావా వేశారు.

ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత

సిటీ సివిల్ కోర్టు 9వ చీఫ్ జడ్జి ముందు ఇంజంక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించేలా నిరాధార ఆరోపణలతో ప్రకటనలు చేశారని పిటిషన్ లో పేర్కొన్న కవిత.. ప్రజల్లో తనకున్న ప్రతిష్టను భంగం కలిగించేందుకు ఆక్రమ పద్ధతు లను ఎంచుకున్నారని తెలిపారు. ప్రతివాదులు తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు పిటిషనర్. మిగిలిన 32 జిల్లా కోర్టుల్లోనూ ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news