ఎమ్మెల్సీ ఎన్నికల రోజున సెలవు ప్రకటించాలి : బల్మూరి వెంకట్

-

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజున పెయిడ్ హాలిడేగా ప్రకటించాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎన్నికల కమిషన్ ని కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం బీఆర్‌కేఆర్ భవన్‌లో చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.

ఈనెల 27న వరంగల్,నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో సెలవు ప్రకటించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఆ రోజు వర్కింగ్ డే ఉన్నందున ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు ఓటేసేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉండదని పేర్కొన్నారు. దీని వలన ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఓటింగ్ శాతం పెరగాలంటే సెలవు ఇవ్వాలని కోరారు. ఈ నిబంధన ఎప్పట్నుంచో ఉన్నదని, కానీ లాస్ట్ టైమ్ సండే రోజు పోలింగ్ జరగడం వలన ప్రత్యేకంగా సెలవు ఇవ్వాల్సిన అవసరం రాలేదని ఆయన గుర్తుచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news