జగన్ పాలనలో మహిళలకు పెద్ద పీట వేస్తున్నారు : ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

-

సీఎం జగన్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పాలనలో మహిళలకు పెద్ద పీట వేస్తున్నారని వరుదు కళ్యాణి కొనియాడారు. అనితను విశాఖలో అబద్ధాల అనిత అని అంటారంటూ వంగపూడి అనితపై విమర్శలు గుప్పించారు వరుదు కళ్యాణి. అంతేకాకుండా.. అనిత వ్యాఖ్యలు చేసే ముందు తనను తాను ప్రశ్నించుకోవాలని ఆమె విమర్శించారు. గూగుల్ లో ఐరన్ లెగ్ ఎవరు అని టైప్ చేస్తే చంద్రబాబు పేరు వస్తుందని వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు.

అనిత స్థాయిని మరిచి సీఎం జగన్ సతీమణి భారతి పై విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అనిత వ్యాఖ్యల వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రిని వెన్నుపోటు పొడుస్తుంటే చంద్రబాబుకి భువనేశ్వరి సపోర్ట్ చేశారంటూ ఆమె ధ్వజమెత్తారు. మహిళలపై వ్యాఖ్యలు చేసే సంస్కృతి వైసీపీ పార్టీలో లేదని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు సీఎం జగన్‌ ప్రవేశపెడుతున్నారని ఆమె అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version