“మోదీ – అమిత్ షా – జేపీ నడ్డా” లమధ్యన కీలక సమావేశం… !

-

రెండు రోజుల క్రితం డిల్లీ వేదికగా కెబినెట్ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్ లో దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో బీజేపీ బాధ్యతలను అప్పగించిన నాయకుల విషయంలో కీలక మార్పులు గురించి చర్చ జరిగింది. కానీ తుది నిర్ణయాన్ని ప్రకటించకుండాఆ బీజేపీ నాయకుల గుండెల్లో ఇంకా ఆ టెన్షన్ ను ఉంచింది. కాగా తాజాగా ఢిల్లీ లో ఉన్న ప్రధానమంత్రి నివాసంలో మోదీతో పాటుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరియు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లు ముగ్గురూ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారని వార్త రాజకీయ వర్గాలలో తిరుగుతోంది. ఈ మీటింగ్ లో కాబినెట్ లో పలువురు మారనున్నారట. అయితే ఇందులో ఎవరిని తొలగించాలి ? ఎవరికి చోటు కల్పించాలి అన్న విషయం పై ఈ ముగ్గురూ ప్రధానంగా చర్చించుకుంటున్నారు.

 

 

ఈ సమావేశం ఇంకా ఎంతసేపు జరుగనుంది, ఎవరెవరిని తొలగిస్తారు అన్న అంశంపై సస్పెన్స్ అప్పటి వరకు కొనసాగనుంది. కాగా తెలంగాణ నుండి బండి సంజయ్ కు కేంద్ర సహాయ మంత్రి పదవి గ్యారంటీ అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version