తమిళనాడు సభలో కన్నీరు పెట్టుకున్న మోడీ..!

-

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో మోడీ పర్యటిస్తున్నారు ఈ క్రమంలో మంగళవారం సేలంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. మోడీ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆడిటర్ వి రమేష్ ని తలుచుకుని ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు ఈ క్రమంలో నిమిషం పాటు తన స్పీచ్ ని ఆపేసి ఆడిటర్ రమేష్ ని దుండగులు హత్య చేసిన విధానం పై మండిపడ్డారు.

ఆయన తమిళనాడులో బిజెపి పార్టీ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు 2013 సంవత్సరంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆడిటర్ వి రమేష్ సేలం పట్నంలో పరవనేరి ప్రాంతంలో ఆయన ఇంటి ప్రాంగణంలో గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా నరికి చంపేశారు ఈ ఘటన ఆ సమయంలో సంచలనంగా మారింది ఒకసారిగా ప్రధాన నరేంద్ర మోడీ ఈ విషయాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version