కెసిఆర్ ను చూస్తే మోడీకి వణుకు – మంత్రి మల్లారెడ్డి

-

మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పిర్జాదిగూడలోని జీవో నెంబర్ 58 కి చెందిన లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి పట్టా సర్టిఫికెట్ల పంపిణీ చేశారు. ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి కి నిరసన సెగ తగిలింది. కొంతమందికే పట్టాలు రావడంతో మిగిలిన వారు మంత్రిని నిలదీశారు. ఈ సందర్భంగా మంత్రికి వినతి పత్రం అందించేందుకు వచ్చిన బిజెపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

దీంతో పట్టాల పంపిణీ కార్యక్రమం కాస్త తీవ్ర ఉధృతంగా మారింది. ఇక అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ను చూస్తే ప్రధాని మోదీకి వణుకు పుడుతుందని, టిఆర్ఎస్ నాయకుల పై మోదీ ఈడీ కేసులతో భయపెడుతున్నారని విరుచుకుపడ్డారు. బిజెపి దొంగల పార్టీ అని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version