సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. యంగ్ డైరెక్టర్ కన్నుమూత

-

సినిమా ఇండస్ట్రీని వరుస మరణాలు కుదిపేస్తున్నాయి. ఇప్పటికే సినీ దిగ్గజాల మరణంతో విషాదంలో కూరుకుపోయిన ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. తాజాగా ఓ యువ దర్శకుడు కన్నుమూశారు. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన యువ దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్ అనారోగ్యంతో మరణించారు. ఆయన వయస్సు కేవలం 31 సంవత్సరాలు.

గత కొన్నిరోజులుగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయనను కేరళలోని ఎర్నాకుళంలో అలువాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. జోసెఫ్ మృతితో మలయాళ చిత్ర సీమలో విషాదం అలుముకుంది. జోసెఫ్ తెరకెక్కిస్తున్న తొలి సినిమా నాన్సీ రాణి త్వరలో విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇంతలోనే ఆయన మరణించారు.

Video Player is loading.

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సమయంలో జోసెఫ్ చనిపోవడంతో ఈ చిత్రబృందం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version