తల్లి మందలించిందని తనయుడి క్రూరత్వం!

-

ఏపీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.తల్లి మందలించిందని ఓ కొడుకు క్రూరత్వంగా వ్యవహరించాడు. ఏకంగా తల్లి మీద దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కమ్మవారిపాలెం గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. నవ మాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి చివరి దశలో తోడుగా ఉండాల్సిన కొడుకే కాలయముడుగా తయారయ్యాడు. కన్న తల్లిని దారుణంగా కొట్టి చంపాడు.

గురువారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో కొడుకు మనోజ్ (22)ను తల్లి సుశీలమ్మ మందలించింది. దీంతో కోపోద్రిక్తుడైన మనోజ్..తల్లి తలపై కర్రతో బలంగా బాదాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సుశీలమ్మను గూడూరుకు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తరలించారు.చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వెద్యం కోసం నెల్లూరుకు తరలించగా.. అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో కన్నుమూసింది. సమాచారం అందుకున్న చిల్లకూరు పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news