తెలంగాణలో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరు : ఎంపీ అరవింద్‌

-

బీఆర్‌ఎస్‌ నేతలపై, ప్రభుత్వంపై మరోసారి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన చేగుంట మండల శివారులో స్థానిక బీజేపీ నాయకులు కలిసిన సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఏ శక్తి ఆపలేదని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారని పేర్కొన్నారు. నిజాంబాద్ కోసం పసుపు బోర్డు విషయమై చాలా సంవత్సరాలుగా కృషి చేసినప్పటికీ కరోనా వల్ల ఆలస్యమైందని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని విమర్శకులు సైతం పేర్కొంటున్నట్లు తెలిపారు. అధికార బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు భారతీయ జనతా పార్టీ గెలుపును అడ్డుకోవడం కోసం సాయి శక్తుల కృషి చేస్తున్నారని విమర్శించారు. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక సైనికుడిగా పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే అసెంబ్లీ టైగర్ రఘు నందన్ రావు మళ్ళీ గెలుస్తాడని కార్యకర్తలు అండగా ఉండాలని కోరారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ను కలిసిన వారిలో బీజేపీ నాయకులు వెంగళరావు, మాజీ సర్పంచులు, జగన్ గౌడ్, నాగభూషణంతో, పాటు పలువురు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version