చంద్రబాబు ప్రచార ఆర్భాటానికి కార్యకర్తలు బలయ్యారు – ఎంపీ భరత్

-

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం కందుకూరులో జరిగిన సభలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తొక్కిసలాటలో మురుగు కాలువలో పడి 8 మంది మరణించారు. పాలమూరులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఆ సమయంలో ఆయన ప్రసంగిస్తుండగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే వాళ్లు కాలువలో పడి మరణించారు. మరికొంతమందికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. తొక్కిసలాట అనంతరం ఆ ప్రాంతమంతా అర్ధనాథాలతో మార్మోగిపోయింది.

ఈ ఘటనపై ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. చంద్రబాబు ప్రచార ఆర్భాటానికి కార్యకర్తలు బలయ్యారని ఆరోపించారు. అప్పుడు పుష్కర ఘాట్ లో 28 మందిని చంపారని.. ఇప్పుడు కందుకూరులో 8 మందిని చంపారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఇదేం కర్మ అని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు భరత్. బాధిత కుటుంబాలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version