వందసార్లు పట్టాభిని “ల*** కొడుకు” అంటా : వైసీపీ ఎంపీ

-

పట్టాభి వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలు ఒక్క సారిగా వేడేక్కిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలతో వైసీపీ దాడులకు దిగడం.. దానికి నిరసనగా చంద్ర బాబు దీక్ష చేయడం మనం చూస్తున్నాం. అలాగే.. టీడీపీ మరియు వైసీపీ ల మధ్య పోటా పోటీ గా మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యం లోనే..తాజాగా వైసీపీ పార్టీ ఎంపీ ఎంవీవీ సత్య నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ బంద్ కు పిలుపిస్తే బడ్డీ కొట్టు కూడా మూతపడ లేదని.. సీమ పందికి కళ్ళజోడు పెడితే పట్టాభి ఆ విధంగా ఉంటారని చురకలు అంటించారు. ఇదే ధోరణి కొనసాగితే జనం రాళ్లతో కొట్టి చంపుతారని పట్టాభికి వార్నింగ్‌ ఇచ్చారు ఎంపీ సత్య నారాయణ.

”పట్టాభి సంకరజాతి నా కొడుకు… నేను వందసార్లు “ల** కొడుకు’ అని పట్టాభిని అంటున్నా ” అంటూ ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు ఎంపీ ఎంవీవీ సత్య నారాయణ. దమ్ముంటే బయట తిరుగు నీ గతి ఏమౌతుందో చూద్దువు గానీ అంటూ పట్టాభి కి సవాల్‌ విసిరారు. అమిత్ షా ను చెప్పులతో కొట్టించిన చరిత్ర, మోడీ నల్ల బ్యాడ్జీలతో నిరసించిన చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీ వెళతారు…!? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news