ఉద్యోగాలను ఊడగొట్టిన అభినవ పులకేశి చంద్రబాబు :విజయసాయిరెడ్డి

-

మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 60 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసి, ఉద్యోగాలు ఇవ్వకుండా.. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిన అభినవ పులకేశి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. మరోవైపు.. మూడేళ్లలో అన్ని రంగాలు అభివృద్ధి చెందేలా ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన గొప్ప వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు విజయసాయిరెడ్డి. వైఎస్సార్‌ జిల్లా చాపాడు సమీపంలోని సీబీఐటీ ఇంజనీరింగ్‌ కాలేజీలో 120 ప్రముఖ కంపెనీలలో 10వేల ఉద్యోగాలు కల్పించేలా నేడు వైఎస్సార్‌సీపీ మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్‌ ప్రభుత్వం లక్షలాది మందికి, వైఎస్సార్‌సీపీ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. ఇంత చేస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేయటం, అలాగే.. ఎమ్మెల్యేగా గెలువలేని, పప్పుతిని పడుకునే వ్యక్తి సవాళ్లు చేయటం మానుకోవాలని హితవు పలికారు. ఇక వైఎస్సార్‌ జిల్లాలోని నిరుద్యోగులందరూ జాబ్‌మేళాను వినియోగించుకోవాలని, ఎంపికవని వారికి శిక్షణనిచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని పిలుపునిచ్చారు విజయసాయిరెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version