తహిసిల్దార్ విజయా రెడ్డిని కాపాడబోయిన డ్రైవర్ గురునాథం కూడా..

-

సోమవారం నాడు అబ్దుల్లాపూర్‌మెట్టు ఎమ్మార్వో విజయా రెడ్డిపై సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.మంటల్లో చిక్కుకొన్న ఎమ్మార్వో విజయారెడ్డిని కాపాడేందుకు డ్రైవర్ గురునాథం తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే విజయారెడ్డిని కాపాడే క్రమంలో గురునాథం తీవ్రంగా గాయపడ్డాడు. 80 శాతం కాలిన గాయాలతో నిన్న ఆస్పత్రిలో చేరిన గురునాథం.. చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచాడు.

సూర్యాపేటకు చెందిన గురునాథం, గడచిన ఎనిమిది సంవత్సరాలుగా విజయారెడ్డి వద్దే డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆమెకు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న గురునాథానికి భార్య, ఒక బిడ్డ ఉండగా, ప్రస్తుతం భార్య గర్భవతిగా ఉంది. కాగా, గాయాల తీవ్రత అధికంగా ఉండటంతోనే ఆయన మరణించాడని వైద్య వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news