నెటిజన్స్ కు షాక్ ఇచ్చిన క్వీన్ మృణాల్..!!

-

అంతకు ముందు ఏన్నో సినిమాల్లో చేసినా కూడా క్రేజ్ రాని మృణాల్ ఠాకూర్ కు సీతారామం సినిమాతో దేశవ్యాప్తంగా విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఆమె కోసం నిర్మాతలు దర్శకులు వెయిట్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఇక సినిమా విడుదల రోజున ఇంత మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడిని హగ్ చేసుకొని మరీ ఏడ్చింది. ఈ సినిమా వల్ల ఆమెకు గౌరవం కూడా పెరిగింది.

తన అందంతో..నటనతో సౌత్ మేకర్స్ ను ఆకర్షించిన బ్యూటీ.. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో  బిజీగా ఉంది. ఈ సినిమా తో వచ్చిన పేరుతో  ఒక పక్క అందాల ప్రదర్శన చేస్తూనే మరో పక్క మంచి పాత్రలు వస్తే విడువకుండా ఆ సినిమాల్లో కూడా నటిస్తూ ఉంది. అయితే రీసెంట్ గా తాను పిప్పా అనే సినిమా కోసం ఇషాన్ పక్కన హీరోయిన్ గా కాకుండా చెల్లిగా నటిస్తోంది. ఇప్పుడు ఇదే విషయం సంచలనం కలిగించింది.

ఆమె పై నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. ఇప్పడు చెల్లిగా నటించి మళ్లీ హీరోయిన్ గా ఎలా చేస్తావు అని కామెంట్స్ చేసారు. ఈ కామెంట్స్ కు ఆమె బదులిస్తూ చెల్లెలు క్యారెక్టర్ లో నటించకూడదా..? అలా నటిస్తే అవకాశాలు తగ్గిపోతాయన్నది తప్పు, రూల్స్‌ బ్రేక్‌ చేసినప్పుడే మన స్త్రెంత్ బయటకి వస్తుంది.అంతే కాదు ఏ పాత్రలోనైనా నటించి.. ఆడియన్స్ ను ఆకట్టుకోవాలి. అప్పుడే మనలో టాలెంట్ ఉంది అని భావించాలి. కెరీర్‌లో వెనక్కి తిరిగిచూసుకుంటే ఓ గొప్ప పాత్రను మిస్‌ చేసుకున్నాను అని నాకు భాద కలగ కూడదు అని గట్టిగానే జవాబు చెప్పింది.

 

Read more RELATED
Recommended to you

Latest news