BREAKING : గెలుపు దిశగా ములాయం సింగ్ కోడలు డింపుల్‌ యాదవ్‌ !

-

ఉత్తరప్రదేశ్ లోని మైన్ పురి లోక్ సభ ఉపఎన్నిక కౌంటింగ్ హోరా హోరీగా కొనసాగుతుంది. ఈ మైన్ పురి లోక్ సభ ఉపఎన్నిక కౌంటింగ్ లో సమాజవాది పార్టీ అభ్యర్థి డింపుల్ యాదవ్ ముందంజలో ఉన్నారు.

ప్రస్తుతం ఆమె సమీప ప్రత్యర్థి కంటే 16, 933 ఓట్ల ఆదిక్యంలో ఉన్నారు. కాగా ఎస్పీ అధినేత మూలాయం సింగ్ యాదవ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

దీంతో ఆయన కోడలు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్, ఎస్పీ నుంచిబరిలోకి దిగారు. కాగా, మొదటి రౌండ్లలో సమాజవాది పార్టీ అభ్యర్థి డింపుల్ యాదవ్ వెనుకంజలో ఉండి, ఇప్పుడు పుంజుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version