రేవంత్‌ రెడ్డిపై పోలీసులకు ములుగు BRS నేతల ఫిర్యాదు

-

ప్రగతి భవన్​ను పేల్చేయాలంటూ టీపీసీసీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై ములుగు జిల్లా బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ పోలీసులను కోరారు. మరోసారి రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు.

హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి మంగళవారం రోజున ములుగులో పర్యటించారు. ఈ పర్యటనలో ప్రసంగిస్తూ రేవంత్ రాష్ట్ర సర్కార్​పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారని ఆగ్రహించారు. ఎంతో మంది తెలంగాణ కోసం ప్రాణాలర్పించింది… కేసీఆర్ కుటుంబం బాగుపడడం కోసమేనా అని ప్రశ్నించారు. ప్రగతి భవన్‌లో పేదలకు చోటు లేదని… నక్సలైట్లు పేల్చేసినా నష్టం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పేదవాడి కడుపు నింపడమే అభివృద్ధి తప్ప.. భవనాలు నిర్మించడం కాదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version