మిమ్మల్ని మరువలేము అంటూ, ఇర్ఫాన్ కు ముంబై పోలీసుల సంతాపం..!

-

బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతితో ఒక్కసారిగా ఇండియన్ సినిమా ఒక్కసారిగా షాక్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయనకు అభిమానులు ఉన్నాయి. హాలీవుడ్ లో కూడా ఆయన నటించి మెప్పించారు. దీనితో సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. బుధవారం ముంబై కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఇండియన్ సినిమా ప్రముఖులు అందరూ కూడా ఇప్పుడు ట్విట్టర్ వేదికగా తమ అనుబంధాన్ని కూడా నేమరవేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన గొప్ప వ్యక్తి అంటూ కీర్తిస్తున్నారు. ఇక ముంబై పోలీసులు కూడా ఆయనకు నివాళులు అర్పించారు. ముంబై పోలీసుల యొక్క అధికారిక ట్విట్టర్ ఖాతాలో… గుడ్ బై ఇర్ఫాన్ మిమ్మల్ని ఎప్పటికి మర్చిపోలేము… చిన్న వయసులో జీవితాన్ని ముగించడం బాధాకరం అని పేర్కొంది.

ఆయన మరణ వార్తను జీర్ణించుకోక ముందే బాలీవుడ్ మరో అగ్ర నటుడు రిషీ కపూర్ తుది శ్వాస విడిచారు. ముంబై లోని ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. క్యాన్సర్ తో గత కొంత కాలంగా బాధ పడుతున్నారు. 24 గంటల్లోపే ఇద్దరు నటులు ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు బాలీవుడ్ ప్రపంచాన్ని విషాదం లోకి నెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news