మునుగోడు సమస్యలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితోనే పరిష్కారంం అవుతాయి – మంత్రి తలసాని

-

మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం ఉప్పరిగూడెంలో మంత్రి తలసాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని.. కాంగ్రెస్, బిజెపి అభ్యర్థుల వెనుక ఎవరున్నారని? ప్రశ్నించారు.

ప్రజా సమస్యలను వదిలేసి ఆ రెండు పార్టీలు కేవలం తిట్లకే పరిమితం అవుతున్నాయని విమర్శించారు. మునుగోడులో బిజెపి నాయకులు ప్రచారం కోసం తిరుగుతుంటే ప్రజలు వారిని అడ్డుకుంటున్నారని చెప్పారు. మూడున్నర ఏళ్లుగా ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి ఏం చేశారో, ఎందుకు గెలిపించాలో మునుగోడు ప్రజలకు చెప్పే ధైర్యం రాజగోపాల్ రెడ్డికి కానీ, బిజెపి నాయకులకు కానీ లేదని విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మునుగోడు ప్రజలు తమ అభ్యర్థినే గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version