మహిళ దినోత్సవం రోజే దారుణం.. హైదరాబాద్ లో ఒకరి హత్య, మరొకరి ఆత్మహత్య !

-

మహిళా దినోత్సవం నాడు హైదరాబాద్ లో దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక మహిళ ఆత్మహత్య చేసుకోగా మరో మహిళ యాసిడ్ ఎటాక్ కు గురై చనిపోయింది. ఇక ముందు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని పరిశీలిస్తే రాజేంద్రనగర్ మైలార్ దేవర్ పల్లి లోని లక్ష్మీ గూడలో అష్రాఫ్ అనే యువకుడు వేధింపులు భరించలేక లిజా అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. బ్యూటీషన్ గా పని చేస్తున్న లిజాని, గత కొద్దిరోజులుగా ప్రేమ పేరుతో అష్రాఫ్ వేధింపులకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు. వేధింపులు తాళలేక నిన్న ఇంట్లో ఉరి వేసుకొని లిజా ఆత్మహత్య చేసుకుంది.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు,  పరారీలో ఉన్న అష్రాఫ్ కోసం గాలిస్తున్నారు. ఇక అల్లాదుర్గం యాసిడ్ దాడి బాధితురాలు మృతి చెందింది. నిన్న సదరు మహిళ మీద యాసిడ్ దాడి జరగగా తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానిక ఆస్పత్రిలో ట్రీట్మెంట్ ఇప్పించారు. అయితే మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ చనిపోయింది. మహిళ పై దాడి చేసిన వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version