నిందితులను పట్టించిన బ్రాస్లెట్..?

-

విశాఖపట్నం లో ఇటీవల జరిగిన హత్య సంచలనం రేపిన విషయం తెలిసిందే. కేసును పోలీసులు సవాల్ గా తీసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే ఎంతో చాకచక్యంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. హత్య కేసులో బ్రాస్లైట్ చేతి గడియారం ఆధారంగా మారి నిందితులను పట్టించిందని పోలీస్ అధికారులు తెలిపారు.

గుర్రం గణేష్ అనే వ్యక్తిని కొంతమంది వ్యక్తులు హత్య చేసి పరారయ్యారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుర్రాల జోగారావు స్వాతి అనే ఇద్దరిని అరెస్టు చేశారు. హత్య చేసి గణేష్ మృతదేహాన్ని కాల్చేసి గుడివాడ అప్పన్న కాలని లోని చేపల కాలువలో నిందితులు పడేసారు. ఈ కేసులో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు సంఘటనా స్థలంలో దొరికిన చేతి వాచీ బ్రాస్లైట్ ఆధారంగా చేసుకుని కేసును ఛేదించారు.స్వాతి తో అసభ్యంగా ప్రవర్తించిన గుర్రాల గణేష్ ను గుర్రాల జోగురావు హెచ్చరించినప్పటికీ తీరులో మార్పు రాకపోవడంతో పథకం ప్రకారం గణేష్ కి ఇద్దరు నిందితులు హత్య చేసినట్లు విచారణలో తేలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version