ఇంటింటికి స్టిక్కర్ల కార్యక్రమంపై నాదెండ్ల మనోహర్ ఫైర్

-

వైసిపి ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి స్టిక్కర్ల కార్యక్రమం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. మంగళవారం తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రచారం కోసం ఇంటింటికి స్టిక్కర్లు అంటించాలని, మొబైల్ స్పై సీఎం జగన్ ఫోటోలు వేయాలని ఆదేశించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.

సీఎం జగన్ కు ఆయన పార్టీ ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదని.. అందుకే వారికి ముందుగా పచ్చబొట్లు వేయించి ప్రజల్లోకి పంపించాలని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో బాధ్యత గల ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలి కానీ.. అవి వదిలేసి ఇంటింటికి స్టిక్కర్లు అంటిస్తామంటే ఎలా అంటూ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version