సీఎం కేసీఆర్ తో మర్యాదపూర్వకంగా సమావేశమైన నాగం

-

మరో నాలుగు వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, వెంటనే ఆయన నివాసానికి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు వెళ్లడం, ఆయనను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించడం తెలిసిందే. ఆ తర్వాత మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్, హరీశ్ ల ఆహ్వానం పట్ల సానుకూలంగా స్పందించిన నాగం జనార్దన్ రెడ్డి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. సీఎం కేసీఆర్ తో నాగం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. ప్రగతి భవన్ కు వచ్చిన సందర్భంగా నాగంను సీఎం కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. సీఎం కేసీఆర్‌ను కలిసి తర్వాత ముహూర్తం నిర్ణయించుకొని బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. అయితే, ఆయన నాగర్‌ కర్నూల్‌ టికెట్‌ ఆశించగా.. పార్టీ ఆయనకు మొండి చేయి చూపింది. ఈ క్రమంలో అనుచరులతో భేటీ అయ్యారు. అనుచరుల కోరిక మేరకు కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎంను నాగం కలువడం ప్రాధాన్యం సంతరించుకున్నది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version