నాగర్ కర్నూల్ లో అధిక వడ్డీలతో మోసం.. అదుపులో తీసుకున్న పోలీసులు..!

-

నాగర్ కర్నూల్ జిల్లా.. కల్వకుర్తిలో అధిక వడ్డీల పేరుతో మోసం చేసిన వ్యక్తిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. అమాయక ప్రజలను మోసం చేసిన కల్వకుర్తికి చెందిన ముజమ్మిల్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. అమాయక ప్రజలను అధిక వడ్డీ ఇస్తానని ఆకర్షించిన ముజమ్మిల్ కోట్ల రూపాయలతో పరారు అయ్యాడు. 2020లో ఆర్ సి ఇన్ఫ్రా, ట్రై కాలర్ పేరుతో వెంచర్లు పెట్టి అధిక వడ్డీ ఇస్తానని వ్యాపారం ప్రారంభం చేసి.. 24 మంది ఏజెంట్లతో అధిక వడ్డీ ఇస్తానని మొదలు పెట్టాడు.

2020-2023 వరకు పెట్టుబడి పెట్టిన వారికి ఒక లక్షకు 50 వేలు అధిక వడ్డీ చెల్లించిన ముజమ్మిల్.. 2023 ఆగస్టు నుండి పరారీలో ఉన్నాడు. అధిక వడ్డీ ఇస్తానంటూ కల్వకుర్తి పరిసర ప్రాంతాల ప్రజల వద్ద 90 కోట్లు తీసుకుని 50 కోట్లు తిరిగి ఇచ్చాడు. మిగతా 40 కోట్లుతో ట్రేడింగ్ లో పెట్టుబడి.. తనను కొందరు వ్యక్తులు ట్రేడింగ్ పేరుతో మోసం చేసినట్లు ముజమ్మిల్ వీడియో విడుదల చేసాడు. ముజమ్మిల్ చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని డిఎస్పి వెంకటేశ్వర్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version