సరికొత్త ప్లాన్ వేస్తున్న కింగ్ నాగార్జున..!!

-

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్‌’ సినిమా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా  ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక పోయింది.ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద  ఇప్పటికి 4.79 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

ఇక  ఇప్పటికే థియేటర్స్ లో కాంతారా సినిమా  హవా నడుస్తోంది. దీపావళికి మరి కొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి. దీంతో ఇక ఈ సినిమా ఫైనల్ రన్ దాదాపు ముగిసినట్లే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.ఇది నాగార్జునను చాలా నిరాశకు గురి చేసింది. చాలా కష్టపడి పనిచేసిన సినిమాకు ఇలాంటి రిజల్ట్ వచ్చిందని చాలా బాధపడ్డారట.

అయితే ఈ భాదను మరచి పోవడానికి యదావిధిగా తన బిగ్ బాస్ షోలో నిమగ్నం అయ్యాడు. అలాగే ప్రస్తుతం అందరూ డబ్బింగ్ సినిమాల పై డబ్బులు సంపాదిస్తూ వున్నారని కొత్త ప్లాన్ వేశారట. అదేమిటంటే ‘ఊపిరి’ మూవీలో తనతో కలిసి నటించిన కార్తీతో పరిచయం తో , అతని సినిమా ‘సర్దార్’ ను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయాలని చూస్తున్నారు.. ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా విడుదల కాబోతుంది. ఇక‘సర్దార్’ సినిమా ద్వారా  ఆయినా నాగార్జున మంచి విజయం అందుకుంటారేమో చూడాలి

Read more RELATED
Recommended to you

Exit mobile version