రేవంత్ రెడ్డికి బిగ్ షాక్… నాంపల్లి కోర్టు సమన్లు జారీ

-

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి ఊహించన షాక్‌ తగిలింది. ఓటుకు నోటు కేసు లో కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. అలాగే…. టీఆర్‌ఎప్‌ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహా, మత్తయ్య జెరూసలేం, వేం కృష్ణ కీర్తన్ లకు కూడా నాంపల్లి ఎంఎస్ జే కోర్టు సమన్లు జారీ చేసింది.

ఓటుకు నోటు కేసు లో ఈడీ ఛార్జ్ షీట్ ను విచారణకు స్వీకరించింది నాంపల్లి కోర్టు. సమన్లు జారీ చేసిన ఈడీ కేసులను విచారణ జరిపింది నాంపల్లి ఎంఎస్ జే కోర్టు. ఈ సందర్భంగానే వారికి సమన్లు జారీ చేసింది నాంపల్లి కోర్టు. ఇక అక్టోబరు 4 న విచారణ కు హాజరు కావాలని నాంపల్లి ఎంఎస్ జే కోర్టు వారికి ఆదేశాలు జారీ చేసింది. కాగా… 2015 ఏడాది నుంచి ఓటు కు నోటు కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రేవంత్‌ రెడ్డి ఏ1 ముద్దాయి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news