నారా బ్రాహ్మణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె బాలకృష్ణ కూతురిగా నారా లోకేష్ సతీమణిగా తనకంటూ ప్రత్యేకమైన గొప్ప కీర్తి ప్రతిష్టలు అందుకుంది. తాను ప్రస్తుతం బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటున్నారు. కానీ చదువుకునే రోజులలో తాను డాక్టర్ కావాలనుకున్నానని నారా బ్రాహ్మణి ఓ సందర్భంగా వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితులలో బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టాల్సి వచ్చిందని బ్రాహ్మణి వెల్లడించారు.

బసవతారకం ఆసుపత్రి ట్రస్ట్ సభ్యురాలిగా ఉన్న ఆమె గైనకాలజికల్ క్యాన్సర్ పై వర్క్ షాప్ లో ఈ మాటలను మాట్లాడారు. క్యాన్సర్లపై మహిళలలో అవగాహన పెంచడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. వైద్యురాలిని కాకపోయినా ఈ ఆస్పత్రి ద్వారా తనకు ఉన్న కోరిక తీరుతుందని బ్రాహ్మణి వెల్లడించారు. బిజినెస్ రంగంలోనూ మంచి గుర్తింపు లభిస్తుందని…. బిజినెస్ వ్యవహారాలు కూడా చాలా బాగా ఉన్నాయని అన్నారు. క్యాన్సర్ వచ్చిందని ప్రజలు భయపడకూడదు. దాన్ని ఎదుర్కోవాలి పోరాడాలి పోరాడి గెలవాలి అని బ్రాహ్మణి మాట్లాడారు. బ్రాహ్మణి మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.