నేటి నుంచి రేషన్ దుకాణాలు ప్రారంభం…కానీ వాళ్లకు మాత్రం ఇంటి దగ్గరే

-

ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శుభవార్త అందజేసింది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29,796 చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఆదివారాలలోనూ సరుకుల పంపిణీ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతి నెలలో మొదటి 15 రోజులు రెండు పూటలా సరుకుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది.

Ration shops open from today
Ration shops open from today

వృద్ధులు, దివ్యాంగులు 65 ఏళ్లు పైబడిన వారికి మాత్రం ఇంటి వద్దకే వచ్చి రేషన్ బియ్యం సరుకులు అందించనున్నారు. పిఠాపురం వార్డు నెంబర్ 18లోని షాపు వద్ద మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో రేషన్ తరలించేందుకు వాహనాలు ఉండేవి. ఇంటింటికి వెళ్లి ప్రజలకు రేషన్ సరుకులు అందించేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందుబాటులోకి వచ్చిన తర్వాత రేషన్ వాహనాలను రద్దు చేసి రేషన్ దుకాణాలను ప్రారంభించారు. దీనిపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రజలకు రేషన్ దుకాణాల వల్ల కష్టాలు వచ్చాయని సీరియస్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news