Breaking : నారా లోకేశ్‌తో చంద్రబాబు భేటీ.. ఆ నియోజకవర్గంపై ఆరా

-

వైసీపీని ఓడించితీరాలన్న కసితో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు గత కొన్ని రోజులుగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నేడు మంగళగిరి, కుప్పం, కర్నూలు, ఇచ్ఛాపురం నియోజకవర్గాల ఇన్చార్జిలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వచ్చే ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటు మంగళగిరి నియోజకవర్గంపై నారా లోకేశ్ తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నియోజకవర్గ గ్రౌండ్ రిపోర్టును లోకేశ్ ను అడిగి తెలుసుకున్నారు.

నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పరిస్థితులు, ఎన్నికల సన్నద్ధత, వ్యూహాలపై టీడీపీ అధినేత చంద్రబాబు చర్చించారు. ఇన్చార్జిలు ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశమై వారి మనోభావాలను తెలుసుకున్నారు. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రానున్నందున, పార్టీ కోసం కష్టపడాలని సూచించారు. అటు, ఇతర నియోజకవర్గాల ఇన్చార్జిలకు కూడా గెలుపే పరమావధి, అందరినీ కలుపుకునిపోవడంపై శ్రద్ధ చూపాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version