అమరావతిలో రైతు పాడె మోసిన నారా లోకేశ్..

-

రాజధాని అమరావతి ప్రాంతంలోని కృష్ణాయపాలెంలో మృతి చెందిన రైతు కృపానందం కుటుంబాన్ని టీడీపీ నేత నారా లోకేశ్ పరామర్శించారు. కృపానందం మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్న కృపానందం శవపేటికను లోకేశ్ మోశారు. అంత్యక్రియులు పూర్తయ్యేంతవరకు నారా లోకేశ్ అక్కడే ఉన్నారు. గత మూడు రోజులుగా అమరావతి ఆందోళనల్లో పాల్గొంటున్న రైతు అద్దెపల్లి కృపానందం బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు.

 

కృపానందం అంత్యక్రియల్లో పాల్గొన్న లోకేశ్… అనంతరం వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని తట్టుకోలేకే కృపానందం మానసిక క్షోభకు గురయ్యారని ఆయన అన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులకు సిగ్గు, శరం లేదని… వారంతా కలిసి రాజధాని తరలించకుండా సీఎం జగన్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ చెప్పిందే కమిటీలు చెబుతున్నాయని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version