వచ్చే ఎన్నికల్లో జగన్ దండుపాళ్యం గ్యాంగ్ చాప్టర్ క్లోజ్ : లోకేశ్‌

-

స్కిల్‌ స్కాంలో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబును బయటకు తీసుకువచ్చందేకు ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఢిల్లీ శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు లోకేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జగన్ దండుపాళ్యం గ్యాంగ్ చాప్టర్ క్లోజ్ అవుతుందని అన్నారు. పోలీసులను అడ్డు పెట్టుకొని ఇంకా ఎన్నాళ్లు అరాచక పాలన కొనసాగిస్తారు? అని నారా లోకేశ్ నిలదీశారు. ముందస్తు ఎన్నికలు వస్తే మూడు నెలలు, షెడ్యూల్ ప్రకారం జరిగితే ఆరు నెలల్లో జగన్ ఇంటికి పోవడం ఖాయమని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. వైసీపీ అరాచక పాలన అంతం కావడం ఖాయమన్నారు.

మహా నియంతలే మట్టిలో కలిచిపోయారని, ఇక మీరెంత? అని ధ్వజమెత్తారు. మీ అధికార మదం ఎలా ఉందంటే ఐటీ ఉద్యోగుల ర్యాలీని కూడా అడ్డుకున్నారన్నారు నారా లోకేశ్ . రాష్ట్ర సరిహద్దులో యుద్ధ వాతావరణం సృష్టించారన్నారు. అంగన్వాడీ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరితే మహిళలను కూడా చూడకుండా రాష్ట్రవ్యాప్తంగా నిర్బంధించారన్నారు నారా లోకేశ్ . ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే నిర్బంధమా? ప్రజా తిరుగుబాటుని అణిచివేయాలని చూస్తే ఉద్యమం అధికమవుతుందన్నారు నారా లోకేశ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version