జగన్ మోహన్ రెడ్డి కాదు..JCB మోహన్ రెడ్డి – లోకేష్

-

జగన్ మోహన్ రెడ్డి కాదు..JCB మోహన్ రెడ్డి అని నారా లోకేష్ ఆగ్రహించారు. ప్రజల ఆదాయం పెరగలేదు, కానీ అడ్డగోలుగా పన్నులు పెంచి ప్రజల్ని హింసిస్తున్నారు. కుడి చేత్తో పది రూపాయిలు ఇచ్చి, విద్యుత్ ఛార్జీలు, ఇంటి పన్ను, ఆర్టీసి ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఇలా ఎడమ చేత్తో జగన్ రెడ్డి వంద రూపాయిలు కొట్టేస్తున్నారని మండిపడ్డారు.

ఇప్పటం గ్రామంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నానని.. ఇంటింటికి వెళ్లి ప్రజల కష్టాల గురించి తెలుసుకున్నానన్నారు లోకేష్‌. చెత్త పన్ను పేరుతో ప్రజల్ని వేధిస్తున్నారు. చెత్త పన్ను కట్టకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తాం, నీటి కనెక్షన్ కట్ చేస్తాం అని బెదిరించడం దారుణమన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మీద పడిన గుంతలు పూడ్చలేని చెత్త ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో ఇళ్లు కూల్చేయడం వైసీపీ పెద్ద సైకో-చిన్న సైకోల పనే. ఇళ్లు కోల్పోయిన బాధితుల పోరాటానికి టిడిపి అండగా ఉంటుంది. జెసిబి మోహన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపులకి ధ్వంసమైన ఇప్పటంలో ఇళ్లను పరిశీలించాను. గ్రామస్తులతో మాట్లాడానని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version