ఏపీ ఎన్నికలపై ఏబీపీ, న్యూస్ 18 ఏ స‌ర్వే రిపోర్ట్ ఇదే !

-

ఇటీవ‌ల ఇండియాటుడే..నేడు ఏబీపీ, న్యూస్ 18 ఏ స‌ర్వే గ‌ణాంకాలు వెల్ల‌డైనా, ఏపీలో టిడిపి-బీజేపీ-జ‌న‌సేన కూట‌మిదే తిరుగులేని విజ‌యం అని తేల్చేస్తున్నాయని నారా లోకేష్ ట్వీట్ చేశారు. సైకో జ‌గ‌న్ చేతిలో ధ్వంస‌మైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్డీఏ కూట‌మి పున‌ర్మిర్మాణం చేయ‌గ‌ల‌ద‌ని ప్ర‌జ‌లు పూర్తి విశ్వాసంతో ఉన్నార‌ని జాతీయ మీడియా సంస్థల స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయన్నారు.

Letter from Rashtrapati Bhavan to Nara Lokesh
TDP nara lokesh 

ఏపీలో మెజారిటీ లోక్ సభ స్థానాల్లో టిడిపి జనసేన విజయం సాధిస్తాయని గతంలో ఇండియా టుడే సర్వే వెల్లడించ‌గా, ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఏబీపీ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్ సభ స్థానాలకు గాను 20 స్థానాల్లో ఎన్డీఏ కూటమి (బిజెపి, టిడిపి, జనసేన) విజయం సాధిస్తాయ‌ని తేలిందని చెప్పారు. మ‌రో జాతీయ మీడియా సంస్థ న్యూస్ 18 ఒపీనియన్ పోల్ సర్వేలోనూ 18 స్థానాల్లో ఎన్డీఏ గెలుస్తుంద‌ని వెల్ల‌డైందన్నారు లోకేష్.

సైకో జ‌గ‌న్ గ్యాంగ్ ఏ విష‌వ్యూహం ప‌న్నినా దారుణ ప‌రాజ‌యం నుంచి వైకాపా త‌ప్పించుకోలేద‌ని స‌ర్వేలు కుండ‌బ‌ద్ద‌లు కొట్టాయి. ప్ర‌జావ్య‌తిరేక తుఫానులో వైకాపాకి అంతిమ‌యాత్ర ఖాయమన్నారు. హ‌లో వై నాట్ 175 జ‌గ‌న్ ..ఛ‌లో లండ‌న్ ..వైకాపా జెండా పీకి శాశ్వ‌తంగా గోతిలో పాతిపెట్టే స‌మ‌యం ఆస‌న్న‌మైందని వివరించాడు.

Read more RELATED
Recommended to you

Latest news