జగన్ గారూ ఆ చట్టం సంగతి ఏంటి సార్…?

-

ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రేప్ ఘటనను ప్రస్తావిస్తూ ఆయన విమర్శలు చేసారు. “దిశ చట్టం నిద్రపోతుందా జగన్ రెడ్డి గారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 9 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురయ్యింది. చిన్నారిని చిదిమేసిన మృగాడు సత్యనారాయణ రెడ్డిని కఠినంగా శిక్షించాల్సింది పోయి, స్థానిక వైకాపా నేతలు రాజీ కుదిర్చే ప్రయత్నం చెయ్యడం దారుణం అని ఆయన మండిపడ్డారు.

lokesh

చిన్నారి పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో మహిళలకు అసలు రక్షణ ఉందా? 21 రోజుల్లో న్యాయం ఎక్కడ? ప్రచార ఆర్భాటంతో మొదటి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన జిల్లాలోనే ఘోరాలు జరుగుతుంటే ఇక మిగిలిన చోట్ల ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్ధమవుతుంది.” అని ఆయన ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version