నా పాదయాత్రకు అడ్డొస్తే..తొక్కుకుంటూ పోతా – నారా లోకేష్

-

మీ జీవో నెంబర్ 1 మడతపెట్టి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో…వారాహి ఆగదు.. ఈ యువగళం ఆగదు.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు.. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తామని జగన్‌ సర్కార్‌ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వార్నింగ్‌ ఇచ్చారు. యువగళం బహిరంగ సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రసంగించారు. యువగళం ప్రజాబలమని..ఏపీని అనేకమంది సీఎంలు అభివృద్ధి చేశారని వెల్లడించారు.

కానీ మూడున్నరేళ్లలో ఏపీని జగన్ నాశనం చేశారని ఆగ్రహించారు.మూడున్నరేళ్లలో ఈ మంత్రులు చేసిందేమిటి? నేను మంత్రిగా ఉన్నప్పుడు రూ.వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేశానని తెలిపారు నారా లోకేష్‌. యువతకు ఈ యువగళం ఓ పెద్ద ప్లాట్ ఫామని.. వేల కోట్ల విలువైన పనులు చేశా.. వేల ఉద్యోగాలు ఇచ్చా.. నన్ను అడిగిన మంత్రులను సూటిగా ప్రశ్నిస్తున్నానన్నారు. మూడున్నరేళ్లలో ఈ మంత్రులు పీకిందేంటి? ఒక్క ఛాన్స్ తో రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశాడు.. రైతులు ఉద్యోగులు, ప్రజలు అంతా ఈ ప్రభుత్వ బాధితులేనని విమర్వలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి అంటే జాదూ రెడ్డి.. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు.. జగన్ జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాలు ఉండవన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version