నారా లోకేష్ సూటి ప్రశ్న : జగన్ పాలనలో జీవించే హక్కు లేదా..?

-

ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా.. ఓ సీఐ, దళిత యువకున్ని బూటుకాలితో తన్నిన అమానుష ఘటన శ్రీ కాకుళం జిల్లాలోని పలాసలో చోటుచేసుకుంది. ఇళ్ల పట్టా అడిగినందుకు మర్రి జగన్‌ అనే దళితుడిపై సీఐ కాలుజేసుకున్నారు. కాగా, ఈ ఘటనపై టీడీపీ టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. వైఎస్ జగన్ గారి పాలనలో దళితులకు జీవించే హక్కు లేదా? మాస్కు పెట్టుకోలేదని కిరణ్‌ని కొట్టి చంపారు. అక్రమ ఇసుక రవాణాకి అడ్డుపడ్డాడని వరప్రసాద్ కి శిరోముండనం చేశారు.

ఇప్పుడు ఇళ్ల పట్టా అడిగినందుకు మర్రి జగన్‌పై దాడికి దిగారు’ అని లోకేశ్ విమర్శించారు. వైసీపీ నాయకుల్లాగే ప్రజలని హింసిస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంపై సీరియస్ అయిన ఏపీ డీజీపి.. దళిత యువకుడిని బూటు కాలితో తన్నినందుకు సీఐ వేణుగోపాల్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఘటనపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ స్పందించారు. సీఐ వేణుగోపాల్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని తగిన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version