జనవరి 22 తేదీ కాదు.. చరిత్ర: ప్రధాని నరేంది మోడీ

-

భారతదేశ పౌరులు శతాబ్దాలు కల నెరవేరిందని ప్రధాన నరేంద్ర మోడీ అయోధ్యలో ప్రసంగంలో చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భ గుడిలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట లో పాల్గొనడం నా అదృష్టమని అన్నారు. ఈ రోజు మన రాముడు అయోధ్యకి వచ్చేసాడు ఈ సందర్భంగా రామ భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు అని అన్నారు.

Prime Minister Narendra Modi reached Ayodhya

మోడీ గర్భగుడిలో ఉన్నంతసేపు బాలరాముడు రూపం తన మనసులో ఉండిపోయిందని మనసు శరీరం మొత్తం బాలరాముడుతో నిండిపోయింది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఇటువంటి గొప్ప కార్యక్రమం లో పాల్గొనలేమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు రాముడు ఓ సాధారణ టెంట్ లో ఉండలేడు కేవలం గర్భగుడిలో మాత్రమే ఉంటాడు అని అన్నారు. ఈరోజు ప్రపంచంలో మరో కొత్త చరిత్రని సృష్టించింది జనవరి 22 కేవలం ఒక తేదీ కాదు అని అన్నారు మోడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version