అయోధ్యలో 20 పూజారుల పోస్టులకు 3 వేల దరఖాస్తులు

-

ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 21 నుంచి మూడురోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రామ మందిర్ తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ పూజారుల పోస్టులకు నియామక క్రతువు చేపట్టగా 3వేల దరఖాస్తులు వచ్చాయని ట్రస్ట్ అధికారి తెలిపారు. వీరిలో కేవలం 20 మందిని మాత్రమే ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు.

3 thousand applications for 20 priest posts in Ayodhya
3 thousand applications for 20 priest posts in Ayodhya

ఇది ఇలా ఉండగా, సుప్రసిద్ధ అయోధ్యలో భవ్యరామమందిరలో రామ్​లల్లా ప్రాణ ప్రతిష్ఠకు సుమూహుర్తం ఖరారైంది. యూపీలోని అయోధ్య రామాలయంలో వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా మృగశిర నక్షత్రంలో అభిజిత్​ ముహుర్తంలో ఈ మహత్తర కార్యక్రమం నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news