జమ్ము కాశ్మీర్లో మరో ఘోర ప్రమాదం జరిగింది. జమ్మూ కాశ్మీర్ లోని దాల్ సరస్సులో… పెను ప్రమాదం చోటుచేసుకుంది. దాల్ సరస్సులో పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు బోల్తా కొట్టింది. బలమైన గాలులు వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతుంది. దీంతో జమ్మూ కాశ్మీర్లో మరోసారి.. ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.

ఇక బోర్డు బోల్తా కొట్టడంతో ప్రాణ భయంతో కేకలు వేశారు ప్రయాణికులు. ఈ నేపథ్యంలోనే రెస్క్యూ టీం సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. గత పది రోజుల కిందట జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే. ఏకంగా 28 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపేశారు. ఇందులో ఇద్దరు విదేశీయులు, 26 మంది స్వదేశీయులు ఉన్నారు.
జమ్ముకశ్మీర్ లో టూరిస్టులకు మరో ప్రమాదం..
దాల్ సరస్సులో బోల్తా పడ్డ పర్యాటకుల బోటు
ప్రాణభయంతో కేకలు వేసిన ప్రయాణికులు
రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు
పూర్తి వివరాలను తెలియాల్సి ఉంది pic.twitter.com/Wfo1252t6u
— BIG TV Breaking News (@bigtvtelugu) May 2, 2025