రాజస్థాన్ లో ఘోర ప్రమాదం.. చిన్నారులతో సహా 11 మంది మృతి..!

-

రాజస్థాన్ లోని ధోల్ పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్లీపర్ కోచ్ బస్సు టెంపోను ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో చిన్నారులతో సహా మొత్తం 11 మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఐదుగురు చిన్నారులు, ముగ్గురు బాలికలు, ఇద్దరూ మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మృతులకు సంబందించిన మృతదేహాలను ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. బారీ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే 11 బీలోని సునిపూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

టెంపో లో ప్రయాణిస్తున్న వారందరూ భారీ నగరంలో గుమత్ మొహల్లా నివాసితులు. వీరంతా బరౌలి గ్రామంలో భాత్ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్నారు. రాజస్థాన్ లోని ధౌల్ పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. కరౌలి-ధోల్ పూర్ హైవే పై సునిపూర్ గ్రామ సమీపంలో స్లీపర్ కోచ్ బస్సు టెంపోను ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకొని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version