అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఈ విమానంలో దాదాపు 242 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాద ఘటనలో చాలామంది మరణించారు. ఒక్కొక్కరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. కొంతమందిని గుర్తించడానికి డీఎన్ఏ పరీక్షలను సైతం చేశారు. కాగా, ఈ విమాన ప్రమాదం జరిగిన వెంటనే అనేక రకాల రక్షణ చర్యలను చేపట్టారు. విమాన ప్రమాదం జరిగిన వెంటనే రక్షణ చర్యలలోకి దిగామని రాజు పటేల్ వెల్లడించారు. ఆంబులెన్సులు రాకముందే చీరలు, బెడ్ షీట్లలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించామని స్పష్టం చేశారు.

ఆ తర్వాత అక్కడ 800 గ్రాముల బంగారు ఆభరణాలు (సుమారు 80 లక్షల) విలువ చేసే బంగారం ఉందని చెప్పారు. రూ. 80,000 నగదు, పాస్పోర్టులు, భగవద్గీత లాంటి విలువైన వస్తువులను సేకరించి పోలీసులకు అప్పగించామని రాజు పటేల్ వెల్లడించారు. కాగా, ఈ వస్తువులను వారి సంబంధికులకు అప్పగిస్తామని హోంమంత్రి అనౌన్స్ చేశారు. కాగా, ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు భారీ మొత్తంలో నగదు అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.