గుడ్ న్యూస్… 3 ఎకరాల వరకు రైతుభరోసా నిధులు విడుదల

-

తెలంగాణలోని రైతులకు శుభవార్త అందజేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లోకి జమ చేశారు. కాగా, ఈరోజు మూడు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను వేసామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కాగా, ఎకరానికి రూ. 6000 చొప్పున మొత్తం 15,51.89 కోట్ల డబ్బులను విడుదల చేశామని స్పష్టం చేశారు. దీని ద్వారా 10. 45 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని వెల్లడించారు.

thummala

ఎకరాలతో సంబంధం లేకుండా భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు అకౌంట్లోకి డబ్బులను జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. దీంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్తను అందజేసింది. వ్యవసాయ పనిముట్లపై 90% సబ్సిడీ అందించింది. వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేస్తే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందడుగు వేయడంతో రైతులు సంతోషపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news