ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాలంటే.. ఇంత ఆదా చేయాల్సిందే..!

-

సహజంగా అందరూ ఎంతో కష్టపడి డబ్బులను సంపాదిస్తూ ఉంటారు, కాకపోతే సరైన విధంగా పొదుపు చేయరు. దానివలన భవిష్యత్తులో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు ఎటువంటి పొదుపు లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందువలన ప్రతి వయసులోనూ పొదుపు అనేది ఎంతో అవసరం. ముఖ్యంగా చిన్న వయసు నుండే దీనిని అలవాటు చేసుకుంటే క్రమంగా పొదుపు చేయడం ఎంతో సులభం అవుతుంది. పొదుపు చేయడంతో పాటుగా వచ్చినదానిలో కొంత శాతాన్ని పెట్టుబడుల్లో పెట్టాలి. ఇలా చేయడం వలన భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది ఎదురైనా, పొదుపు చేసిన డబ్బులను ఉపయోగించుకోవచ్చు.

20 ఏళ్ల నుండి కొంచెం పొదుపు చేయడం ప్రారంభించడం వలన భవిష్యత్తులో ఆనందంగా ఉంటారు. పొదుపు చేయడానికి ఎస్ఐపీ లో పెట్టుబడులు చేయవచ్చు. ఇలా చేయడం వలన వడ్డీ పొందుతారు. 30 ఏళ్లు వచ్చేసరికి ఆదాయం పెరుగుతుంది, దాని వలన పొదుపు కూడా ఎక్కువగా చేయవచ్చు. ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, మ్యూచువల్ ఫండ్స్ వంటి సాధనాలను ఉపయోగించి ఆదాయాన్ని పెంచుకోవచ్చు మరియు పొదుపును కూడా చేయవచ్చు. 40 ఏళ్లు వచ్చేసరికి ఆదాయం మరింత పెరుగుతుంది, కనుక దానిలో కనీసం 25 నుండి 30% వరకు పొదుపుని చేయాలి.

ఇలా చేయడం వలన భవిష్యత్తులో పిల్లల చదువులు, పదవి విరమణ సమయంలో ఖర్చులకు కూడా ఉపయోగించుకోవచ్చు. పొదుపు చేస్తే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించుకోవచ్చు. 50 ఏళ్లు వచ్చేసరికి, పదవి విరమణ సమయంలో ఎటువంటి అప్పులు లేకుండా చూసుకోవాలి. 60 ఏళ్ల తర్వాత జీవితానికి కూడా మంచి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. వార్షిక ఆదాయాన్ని సరైన ప్రణాళిక ద్వారా పొదుపు చేస్తే, ఆర్థికంగా ఎంతో సురక్షితంగా జీవించవచ్చు. అంతేకాక ఇన్సూరెన్స్ వంటి వాటి పై కూడా ఎంతో దృష్టి పెట్టాలి. ఇలా చేయడం వలన వైద్య ఖర్చుల నుండి విముక్తి పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news